రేప‌ట్నుంచే రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగుల‌కు శుభవార్త

- April 01, 2022 , by Maagulf
రేప‌ట్నుంచే రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగుల‌కు శుభవార్త

హైద‌రాబాద్: ప‌విత్ర రమదాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 3 నుంచి మే 2వ తేదీ వ‌ర‌కు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంట‌ల‌కే త‌మ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. నెలవంక దర్శనం మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఇస్లాంలో రమదాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపైకి అవతరించింది. దీనికి ప్రతీక‌గా ఈ మాసంలో ఉపవాసాలను ఆచరిస్తారు. రమదాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com