మోసం కేసులో బహ్రెయినీ తండ్రి, కొడుక్కి ఊరట

- April 04, 2022 , by Maagulf
మోసం కేసులో బహ్రెయినీ తండ్రి, కొడుక్కి ఊరట

మనామా: హై అప్పీల్స్ కోర్టు ఓ బహ్రెయినీ వ్యక్తికీ, ఆయన తనయుడికీ మోసం కేసు నుంచి ఊరట కల్పించింది.కింది కోర్టు ఈ ఇద్దరికీ ఊరటనివ్వగా, దాన్ని అవతలి వ్యక్తి అప్పీల్ చేశారు. బాధితుడుగా చెప్పబడుతున్న వ్యక్తి 100,000 బహ్రెయినీ దినార్లు తన కంపెనీల ద్వారా బహ్రెయినీ వ్యక్తికి ఇచ్చినట్లు కేసులో పేర్కొన్నారు. 10 శాతం లాభంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందం గడువు పూర్తయ్యాక చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని బాదితుడుగా చెప్పబడుతున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదయ్యింది. కాగా, ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున న్యాయస్థానం కేసుని కొట్టివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com