ఆహార పదార్థాల ధరల నియంత్రణకు బహ్రెయిన్ చర్యలు

- April 05, 2022 , by Maagulf
ఆహార పదార్థాల ధరల నియంత్రణకు బహ్రెయిన్ చర్యలు

బహ్రెయిన్: పవిత్ర రమదాన్ మాసంలో ధరలు పెరగకుండా చూసేందుకు స్థానిక మార్కెట్‌లలో అన్ని ఆహార ఉత్పత్తుల ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ తెలిపింది. పండ్లు, కూరగాయలతో సహా అన్ని నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. పవిత్ర మాసంలో భారీ డిమాండ్ నేపథ్యంలో వాటి ధరలను పెంచే లక్ష్యంతో వ్యాపారులు పండ్లు, కూరగాయలను నిల్వ చేయకుండా తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించింది. అధిక మొత్తంలో పండ్లు, కూరగాయలు నిల్వ ఉంచిన పలువురు వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్లు బహ్రెయిన్ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com