సౌదీ అరేబియా అబ్షెర్ ద్వారా ఇరాక్కు ప్రయాణ అనుమతి
- April 05, 2022
రియాద్: అబ్షెర్ ప్లాట్ఫారమ్ ద్వారా ఇరాక్కు ప్రయాణ అనుమతిని జారీ చేయనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది. ఇరాక్కు ప్రయాణ అనుమతులు జారీ చేసే సర్వీసును అబ్షెర్ ప్లాట్ఫారమ్లోని తవాసుల్ జాబితాలో చేర్చినట్లు చెప్పింది. ఇది జవాజాత్ ప్రధాన కార్యాలయం లేదా బ్రాంచ్ కార్యాలయాలను వ్యక్తిగతంగా సంప్రదించాల్సిన అవసరం లేకుండానే ప్రయాణ అనుమతిని పొందేందుకు లబ్ధిదారులకు అవకాశం కల్పించారు. నిబంధనలు, షరతులకు అనుగుణంగా ప్రయాణ అనుమతి జారీ చేయబడుతుందని జవాజత్ తెలిపింది. నా సేవల జాబితా (ఖిద్మతి) లోకి వెళ్లి.. జవాజత్ సెక్టార్, తవాసుల్ సర్వీస్ ను ఎంచుకోవాలి. కొత్త అప్లికేషన్ను సమర్పించడం, దరఖాస్తు రకాన్ని పేర్కొనడం ద్వారా అబ్షర్ ప్లాట్ఫారమ్లోని లబ్ధిదారుల అకౌంట్ ద్వారా సర్వీసును యాక్సెస్ చేయవచ్చు. దీని తర్వాత దరఖాస్తుదారు సబ్-సర్వీస్ “రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్కి ప్రయాణ అనుమతిని” ఎంచుకోవాలి. ఆపై అనుమతిని పొందడం కోసం దరఖాస్తుదారునికి సమీపంలోని ప్రాంతీయ కార్యాలయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దరఖాస్తుదారు తమ వివరాలను రాసి దానికి జాతీయ ID కాపీ, కుటుంబ కార్డ్ ను జతచేసి అధికారులకు అందివ్వాలి.దరఖాస్తుదారు సమర్పించిన అన్ని పత్రాలను పరిశీలించింది అనుమతి పత్రాన్ని జవాజత్ వెబ్సైట్లో అందుబాటులో పెడతామని జవాజత్ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









