ప్రధాని మోడీ , ఆర్థిక మంత్రితో ముగిసిన ఏపీ సీఎం జగన్‌ భేటీ..

- April 05, 2022 , by Maagulf
ప్రధాని మోడీ , ఆర్థిక మంత్రితో ముగిసిన ఏపీ సీఎం జగన్‌ భేటీ..

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశం ముగిసింది.ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ, జగన్ మధ్య గంటకు పైగా చర్చ జరిగింది.ఏపీ అభివృద్ధి అంశాలను ప్రధానితో జగన్ ప్రస్తావించారు. ఏపీకి ఆర్థిక చేయూత, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై విజ్ఞప్తి చేశారు.

పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని జగన్ విజ్ఞప్తి చేశారు.రాష్ట్రానికి నిధులపై ప్రధానితో సీఎం జగన్ చర్చించారు.మోడీ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చర్చించారు.

రాత్రి 9:30గంటలకు హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు.రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.ఏపీలో కొత్తగా 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని కోరే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com