డ్రగ్స్ కేసులో ఇజ్రాయెల్ మహిళకు మరణశిక్ష

- April 07, 2022 , by Maagulf
డ్రగ్స్ కేసులో ఇజ్రాయెల్ మహిళకు మరణశిక్ష

యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 500 గ్రాముల కొకైన్ కలిగి ఉన్నందుకు దోషిగా తేలిన ఒక ఇజ్రాయెల్ మహిళకు మరణశిక్ష పడింది. కాగా మరణశిక్ష పడిన  43 ఏళ్ల ఫిదా కివాన్‌ శిక్షపై అప్పీల్ చేసింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఫోటోగ్రఫీ స్టూడియోను కలిగి ఉన్న మహిళ, ఏడాది క్రితం పని కోసం దుబాయ్‌కి వచ్చింది. ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్‌లో పోలీసులు కొకైన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ తర్వాత ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే డ్రగ్స్ తనవి కావని కివాన్ కోర్టులో వాదించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com