మీడియా ప్రతినిధులకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన పేర్ని నాని
- April 07, 2022
విజయవాడ: ఏపీలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు ఈరోజు రాజీనామా చేయబోతున్నారు. ఈ తరుణంలో పేర్ని నాని మీడియా కు విందు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను ఖుషి చేశారు. ఈ విందులో మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. తనకు ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. తనకు మీడియా చేసిన సహాయం అమోఘమని, ఈ మూడేళ్ళలో మీడియా మిత్రులు అందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని పేర్కొన్నారు.
మరోపక్క వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ప్రస్తుత మంత్రులకు ఇదే చివరి కేబినెట్ భేటీ కావడంతో మంత్రులంతా ఫుల్ జోష్ లో హడావిడి గా కనిపించారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులు రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రి వర్గానికి సంబంధించిన జాబితా ఈ నెల 10న వెలువడే అవకాశం ఉంది. మరి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







