ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభం
- April 03, 2016
కొన్ని రకాల పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి 2016-17 అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఈ-ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అదేవిధంగా పన్ను చెల్లింపు లెక్కలను సులువుగా సరిచూసుకోవడం కోసం కొత్త ఆన్లైన్ కాలిక్యులేటర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది బడ్జెట్లో పన్ను రేట్లలో మార్పుచేర్పులకు అనుగుణంగా కాలిక్యులేటర్లోనూ మార్పులు చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. జీతాలు, వడ్డీ రూపంలో ఆదాయం లభించే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్-1(సహజ్), ఇతర వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హెచ్యూఎఫ్ (హిందూ అవిభాజ్య కుటుంబాలు), భాగస్వామ్య సంస్థల కోసం ఐటీఆర్-4ఎస్(సుగమ్) ఈ-ఫైలింగ్ను ఆరంభించినట్లు ఐటీ శాఖ ఉన్నతాధికారి చెప్పారు.
త్వరలోనే ఇతర ఐటీఆర్లను కూడా ఐటీ శాఖ పోర్టల్(http://incomtaxindiaefiling.gov.in) లో ఉంచుతామని తెలిపారు. ఐటీఆర్ ఫారాల్లో పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ప్రయాణాలు, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాలన్న నిబంధనను గతేడాది ఐటీ శాఖ కొత్తగా విధించడంతో వివాదం చెలరేగడం తెలిసిందే. దీంతో సరళీకరించిన ఐటీఆర్ ఫారాలను ప్రవేశపెట్టారు. ఈసారి మార్చి 30నే కొత్త ఐటీఆర్ ఫారాలను సీబీడీటీ నోటిఫై చేసింది. రిటర్నుల దాఖలుకు జూలై 31 వరకూ గడువు ఉంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









