సుప్రీం చేతిలో ఓడిపోయిన ఇమ్రాన్ ప్రభుత్వం
- April 07, 2022
ఇస్లామాబాద్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు గురువారం గట్టి షాకిచ్చింది సుప్రీం కోర్టు. ఇమ్రాన్ సర్కారుపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సిందేనంటూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఓటింగ్ను నిర్వహించమని ఆదేశించింది. గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి.
కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఇప్పటికే ఇమ్రాన్ పార్టీలోని కొందరితో పాటు మద్దతిస్తున్న మిత్రపక్షాల్లోని మరికొందరు నేతలు విపక్షంతో చేరిపోయారు.
ఇటువంటి కీలక సమయంలో తమ ప్రభుత్వ మనుగడ కోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేసిన ఇమ్రాన్… పాక్ జాతీయ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్తో ప్రకటన చేయించారు. ఇమ్రాన్ వ్యూహం మేరకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ను రద్దు చేసిన డిప్యూటీ స్పీకర్.. ఏకంగా జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విపక్షాలకు అనుకూలమైన తీర్పు వచ్చింది.
జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదంటూ వెల్లడించింది కోర్టు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









