సుప్రీం చేతిలో ఓడిపోయిన ఇమ్రాన్ ప్రభుత్వం
- April 07, 2022
ఇస్లామాబాద్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు గురువారం గట్టి షాకిచ్చింది సుప్రీం కోర్టు. ఇమ్రాన్ సర్కారుపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సిందేనంటూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఓటింగ్ను నిర్వహించమని ఆదేశించింది. గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి.
కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఇప్పటికే ఇమ్రాన్ పార్టీలోని కొందరితో పాటు మద్దతిస్తున్న మిత్రపక్షాల్లోని మరికొందరు నేతలు విపక్షంతో చేరిపోయారు.
ఇటువంటి కీలక సమయంలో తమ ప్రభుత్వ మనుగడ కోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేసిన ఇమ్రాన్… పాక్ జాతీయ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్తో ప్రకటన చేయించారు. ఇమ్రాన్ వ్యూహం మేరకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ను రద్దు చేసిన డిప్యూటీ స్పీకర్.. ఏకంగా జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విపక్షాలకు అనుకూలమైన తీర్పు వచ్చింది.
జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదంటూ వెల్లడించింది కోర్టు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







