క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టిన 33 శాతం రెసిడెంట్స్
- April 08, 2022యూఏఈ: వర్చువల్ ఆస్తులను నియంత్రించే కొత్త చట్టాలను దుబాయ్ ఆమోదించిన ఒక నెల తర్వాత.. 33 శాతం యఏఈ రెసిడెంట్స్ క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పెట్టినట్లు ఒక సర్వేలో తేలింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారని సదరు సర్వే పేర్కొంది. UAEలోని రెసిడెంట్స్ తమ పెట్టుబడి పెట్టదగిన ఆస్తులలో 26 శాతం క్రిప్టోకరెన్సీకి కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఇది 20 శాతంగా ఉందని ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ టోలునా సర్వే పేర్కొంది. ఈ అధ్యయనం కోసం 18-64 సంవత్సరాల మధ్య ఉన్నవారిపై సర్వే నిర్వహించారు. ఎమిరేట్స్ లో 500 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 9,000 మందితో ఈ సర్వేను నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలను విశ్వసిస్తున్నట్లు 18 శాతం మంది UAE రెసిడెంట్స్ సర్వేలో చెప్పడం గమనార్హం.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు