క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టిన 33 శాతం రెసిడెంట్స్
- April 08, 2022
యూఏఈ: వర్చువల్ ఆస్తులను నియంత్రించే కొత్త చట్టాలను దుబాయ్ ఆమోదించిన ఒక నెల తర్వాత.. 33 శాతం యఏఈ రెసిడెంట్స్ క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పెట్టినట్లు ఒక సర్వేలో తేలింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారని సదరు సర్వే పేర్కొంది. UAEలోని రెసిడెంట్స్ తమ పెట్టుబడి పెట్టదగిన ఆస్తులలో 26 శాతం క్రిప్టోకరెన్సీకి కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఇది 20 శాతంగా ఉందని ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ టోలునా సర్వే పేర్కొంది. ఈ అధ్యయనం కోసం 18-64 సంవత్సరాల మధ్య ఉన్నవారిపై సర్వే నిర్వహించారు. ఎమిరేట్స్ లో 500 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 9,000 మందితో ఈ సర్వేను నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలను విశ్వసిస్తున్నట్లు 18 శాతం మంది UAE రెసిడెంట్స్ సర్వేలో చెప్పడం గమనార్హం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







