కువైట్ లో 75 వేలకు తగ్గిన 'గృహ' కార్మికుల సంఖ్య
- April 10, 2022
కువైట్: కరోనా మహమ్మారి కారణంగా డిసెంబర్ 2020 నుండి డిసెంబర్ 2021 వరకు కేవలం ఒక సంవత్సరంలో దాదాపు 75,000 మంది గృహ కార్మికులు తగ్గిపోయారు. ఈ మేరకు లేబర్ మార్కెట్ గణాంకాలను సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ జారీ చేసింది. దీని ప్రకారం.. గత డిసెంబర్ వరకు గృహస్థుల సంఖ్య 593,684 మంది (పురుషులు, స్త్రీలు) కార్మికులుగా ఉండగా.. డిసెంబర్ 2020లో వారి సంఖ్య 668,000 కంటే ఎక్కువగా ఉండేది. గణాంకాల ప్రకారం భారతీయ కార్మికులు అత్యధికంగా ఉన్నారు. డిసెంబర్ 2021లో వారి సంఖ్య దాదాపు 279,000గా ఉంది. ఫిలిప్పీన్స్ కార్మికులు 135,400 మందితో రెండవ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ కార్మికులు 76,800 మందితో మూడో స్థానంలో.. శ్రీలంక 64,400 మందితో నాల్గవ స్థానంలో ఉన్నారు. నేపాల్ కార్మికులు 11,451 మందితో ఐదవ స్థానంలో ఉన్నారు. 10,689 మందితో ఇథియోపియన్లు, 2,407 మందితో ఇండోనేషియా, బెనిన్ నుండి కార్మికులు 1,583, పాకిస్తాన్ నుండి 1,580, సూడాన్ నుండి 1,331 మంది కార్మికులు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!









