కువైట్ లో 75 వేలకు తగ్గిన 'గృహ' కార్మికుల సంఖ్య
- April 10, 2022
కువైట్: కరోనా మహమ్మారి కారణంగా డిసెంబర్ 2020 నుండి డిసెంబర్ 2021 వరకు కేవలం ఒక సంవత్సరంలో దాదాపు 75,000 మంది గృహ కార్మికులు తగ్గిపోయారు. ఈ మేరకు లేబర్ మార్కెట్ గణాంకాలను సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ జారీ చేసింది. దీని ప్రకారం.. గత డిసెంబర్ వరకు గృహస్థుల సంఖ్య 593,684 మంది (పురుషులు, స్త్రీలు) కార్మికులుగా ఉండగా.. డిసెంబర్ 2020లో వారి సంఖ్య 668,000 కంటే ఎక్కువగా ఉండేది. గణాంకాల ప్రకారం భారతీయ కార్మికులు అత్యధికంగా ఉన్నారు. డిసెంబర్ 2021లో వారి సంఖ్య దాదాపు 279,000గా ఉంది. ఫిలిప్పీన్స్ కార్మికులు 135,400 మందితో రెండవ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ కార్మికులు 76,800 మందితో మూడో స్థానంలో.. శ్రీలంక 64,400 మందితో నాల్గవ స్థానంలో ఉన్నారు. నేపాల్ కార్మికులు 11,451 మందితో ఐదవ స్థానంలో ఉన్నారు. 10,689 మందితో ఇథియోపియన్లు, 2,407 మందితో ఇండోనేషియా, బెనిన్ నుండి కార్మికులు 1,583, పాకిస్తాన్ నుండి 1,580, సూడాన్ నుండి 1,331 మంది కార్మికులు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







