గుజరాత్: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు…ఆరుగురి మృతి

- April 11, 2022 , by Maagulf
గుజరాత్: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు…ఆరుగురి మృతి

గుజరాత్: గుజరాత్ భారుచ్ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈరోజు భారీ పేలుడు సంభవించింది.ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు కార్మికులు మృతి చెందారు.అహ్మదాబాద్ నగరానికి 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ పారిశ్రామికవాడలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది.పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో అక్కడ సమీపంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మరణించారు.

కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపు చేశామని భారుచ్ జిల్లా ఎస్పీ లీనా పాటిల్ చెప్పారు. రియాక్టర్ పేలుడులో అక్కడే పనిచేస్తున్న కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com