పాకిస్థాన్లోని పలు ప్రాంతాలను ముంచెత్తిన వరదలు ..
- April 04, 2016
పాకిస్థాన్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 57 మంది మృతిచెందగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పాక్లోని ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్, షాంగ్లా జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వరదల కారణంగా షాంగ్లా జిల్లాలో 14 మంది, కోహిస్థాన్లో 12 మంది, స్వాత్లో 8 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పాక్ ఆక్రమిక కశ్మీర్, గిల్గిత్ బల్తిస్థాన్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి చిన్నారులతో సహా ఎనిమిదిమంది మృతిచెందారు. భారీ వరదలకు పలు ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వరదలు తగ్గుముఖం పట్టేవరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







