తెలంగాణలో మరో రూ. 200 కోట్ల పెట్టుబడులు..
- April 12, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. బీఎస్ వీ గ్లోబల్ అనే సంస్థ హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లను తయారు చేసే యూనిట్ ను నెలకొల్పనుంది. నేడు ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ.200 కోట్లతో సంస్థ ఆ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. సంస్థ పెట్టుబడులతో హైదరాబాద్ కు వ్యాక్సిన్ హబ్ అనే పేరు సార్థకం అవుతుందని చెప్పారు. సంస్థ ఎండీ సంజీవ్ స్నావన్ గుల్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఇటీవల కేటీఆర్ అమెరికాలో పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. క్వాల్కమ్, క్యాలవే, ఫిస్కర్ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిన సంగతి విదితమే. ఫిష్ఇన్ అనే సంస్థ మిడ్ మానేరులో చేపల ప్రాసెసింగ్ యూనిట్ ను పెడతామని హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!