ఉపాధి కోసం అరబ్ దేశం వెళ్లింది..కానీ అలా చేయడంతో చివరికి ఉరిశిక్షకు గురయ్యింది..
- April 13, 2022యెమెన్: ఉపాధి కోసం, మంచి జీతం కోసం చాలామంది భారతీయులు ఫారిన్కు వెళ్లడం సహజమే. ఈ మధ్య ఇలాంటి వారి సంఖ్య మరింత పెరిగిపోయింది.అయితే అలా ఉపాధి కోసం యెమెన్ దేశం కు వెళ్లింది ఓ మహిళ.
కానీ తనకు ఓ ఊహించని సమస్య వచ్చింది.దానివల్ల అక్కడి కోర్టు తనకు ఉరిశిక్షను ఖరారు చేసింది.ఇదంతా ఓ సినిమా కథను తలపించేలా ఉంది.
కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే మహిళ నర్సు వృత్తిలో ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం తను ఉపాధి కోసం అరబ్ దేశమైన యెమెన్కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి దగ్గర నర్సుగా పనిచేసింది. 2017లో ఆ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి రోజువారీగా తీసుకునే ఇంజెక్షన్లు, మాత్రలు ఓవర్డోస్ అవ్వడంతోనే మరణించాడని నిర్ధారణ అయ్యింది. దీంతో నిమిషా ప్రియా చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.
నిమిషా ప్రియా వల్లే ఆ వ్యక్తి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం మొదలుపెట్టారు.తమ తండ్రి దగ్గర నిమిషా ప్రియా పాస్పోర్ట్ ఉందని అందుకోసమే ఆయనను చంపేసిందని ఆ వ్యక్తి వారసులు తెలిపారు. అంతే కాకుండా తమ తండ్రితో తనకు పెళ్లి అయిపోయినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా సృష్టించింది అని అన్నారు.అయితే పోలీసుల విచారణలో కూడా ఆధారాలన్నీ నిమిషా ప్రియాకు వ్యతిరేకంగా ఉన్నాయి.
ఆ వ్యక్తిని చంపిన కేసులో యెమెన్ కోర్టు నిమిషా ప్రియా నిందితురాలంటూ ఉరిశిక్ష విధించింది. ఇటీవల ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు నిమిషా ప్రియాకు క్షమాభిక్ష పెట్టడానికి ఒప్పుకున్నారు.కానీ బదులుగా కొంత మొత్తాన్ని ఇవ్వమని అడిగారు.నిమిషా ప్రియా కుటుంబానికి అంత స్థోమత లేకపోవడంతో ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు చేరింది.అయితే, దౌత్యపరమైన ఈ విషయంలో కలగజేసుకోబోమని హైకోర్టు ధ్రువీకరించింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్