NRI TDP విభాగం వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు
- April 15, 2022
హైదరాబాద్:వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం పార్టీ అభిమానులను, వారు ఏర్పాటు చేసుకున్న సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఎన్.ఆర్.ఐ టీడీపీ విభాగాన్ని తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసింది.ఇందు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ సైట్ http://www.nritdp.com ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన నివాసంలో లాంచనంగా ప్రారంభించారు.ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్.ఆర్.ఐ నుంచి పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు.ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 1200 మంది కౌన్సిల్ మెంబర్స్ ని ఏర్పాటు చేయటంతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ - ల్యాండ్ లైన్ +918645350888 వాట్సాప్ +918950674837 ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వటంతోపాటు, ఏపీలో ఐటి, టెక్నికల్ వంటి పలు ఉద్యోగ, ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ఈ విభాగం నిర్వహించనుంది. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ప్రోసిజరల్ గైడ్ లైన్స్ ఇవ్వటంతోపాటు ఆపద సమయంలో సాయం అందించేందుకు ఈ ఎన్.ఆర్.ఐ టిడిపి సెల్ పని చేస్తుంది.
ఈ సందర్బంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...యుద్ద సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించటంలో ఎన్.ఆర్.ఐ టిడిపి సెల్ చేసిన సేవలను కొనియాడారు. వివిధ దేశాల్లో టీడీపీ 40 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.విదేశాల్లో స్థిరపడ్డ టీడీపీ అభిమానులంతా ఈ వైబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డా.వేమూరు రవి కుమార్, రాజశేఖర్ చప్పిడి తో పాటుగా పార్టీ అమెరికా కోఆర్డినేటర్ కోమటి జయరాం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









