బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై నిషేధం: రష్యా
- April 16, 2022
మాస్కో: ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో తనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆంక్షలు విధించిన నేపథ్యంలో, రష్యా కూడా ప్రతిచర్యకు దిగింది. అప్పటికే పలువురు అంతర్జాతీయ నేతలు రష్యాలో ప్రవేశించకుండా నిషేధించిన పుతిన్ ప్రభుత్వం… తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పైనా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.
అంతేకాదు, రష్యాలో ప్రవేశించకుండా బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ +ట్రస్, అనేకమంది క్యాబినెట్ మంత్రులపైనా నిషేధాజ్ఞలు విధించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. మొత్తమ్మీద ప్రధాని బోరిస్ జాన్సన్ సహా 13 మంది బ్రిటన్ ప్రముఖులను నిషేధిత నేతల జాబితాలో చేర్చింది. వారిలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరిస్సా మే కూడా ఉన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ జాబితాను మరింత విస్తరిస్తామని కూడా రష్యా హెచ్చరించింది.
ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు దిగిన నేపథ్యంలో, రష్యాను ఏకాకిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలకు తెరలేపాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన కుటుంబ సభ్యులపై అనేక దేశాలు నిషేధం విధించాయి. పుతిన్ కుటుంబ ఆస్తులతో పాటు, విదేశాల్లోని రష్యన్ కుబేరుల ఆస్తులపైనా, రష్యా కంపెనీలపైనా కఠిన ఆంక్షలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, రష్యా కూడా పలు దేశాల ప్రముఖులను నిషేధిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









