మూత్రపిండాల సమస్యలకు చెక్ పెట్టె పుచ్చకాయ గింజలు.. !
- April 17, 2022వేసవికాలం వచ్చిందంటే చాలు..అందరికీ ముందుకు గుర్తుకువచ్చేది పుచ్చపండునే... వేసవికాలాన్ని పుచ్చపండుకాలం అని కూడా అంటుంటారు కొందరు..ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదటి ప్రాధాన్యత దీనికే ఇస్తారు.గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ పుచ్చపండు ఎంతో మేలు చేసింది.రక్త పోటు ఉన్నవారు పుచ్చపండు తింటే ఎంతో మేలని చెప్పాలి.ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. పుచ్చపండు 91% నీరు, 6% చక్కెరలను కలిగి ఉంటుంది.ఈ పండులోని నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చపండు అనేది ఓ వరం లాంటిది.భోజనం తర్వాత పుచ్చపండు రసం తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.ఊబకాయాన్ని తగ్గించడంలో ఇది ఎంతో తోడ్పడుతుంది. మండేవేడిలో తలనొప్పి వస్తే అర గ్లాసు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పొడి దగ్గులో పుచ్చపండు తింటే తరచుగా వచ్చే దగ్గు ఆగిపోతుంది కూడా.
విటమిన్ ఎ, బి, సి మరియు ఐరన్ కూడా పుచ్చకాయలో సమృద్ధిగా లభిస్తాయి.ఆస్తమా బాధితులకి ఇది ఓ ఔషదమనే చెప్పాలి.ఇక ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఈ పండుతో అనేక లాభాలున్నాయి. దీని తీసుకోవడం వల్ల ముఖకాంతి పెరుగుతుంది.ముడతలు తగ్గుతాయి. వేసవిలో చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
ఇక ఇందులోని గింజలు కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి.వీటి వలన మెదడు బలహీనమైన నరాలు బలాన్ని పొందుతాయి.కామెర్లు వంటి సమస్యలలో పుచ్చకాయ గింజలను తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది.పుచ్చకాయ గింజలతో తయారుచేసిన టీని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మూత్రపిండాల సమస్యలను నివారించవచ్చు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం