మిస్ ఇండియా పోటీలకు హీరో రాజశేఖర్ కూతురు

- April 18, 2022 , by Maagulf
మిస్ ఇండియా పోటీలకు హీరో రాజశేఖర్ కూతురు

సినీ హీరో, యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని తనకు సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులతో పంచుకొంది. త్వరలో జరగబోయే మిస్ ఇండియా 2022 పోటీలలో పాల్గొనబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఇందుకు మీ మద్ధతు కావాలని అభిమానులను కోరింది. ఈ సందర్భంగా 'ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా సంస్థకు థ్యాంక్స్. పోటీలో పాల్గొనబోతున్న తోటి మహిళలకు, నాకు ఆల్ ద బెస్ట్' అంటూ పోస్ట్ చేసింది. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు శివాని విజయం సాధించాలని విష్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com