20 ఏప్రిల్ బుధవారం భారత ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్

- April 18, 2022 , by Maagulf
20 ఏప్రిల్ బుధవారం భారత ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్

కువైట్: తదుపరి ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్ ఏప్రిల్ 20 బుధవారం నాడు జరగనుంది. భారత రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తారు. ఎంబసీ ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఓపెన్ హౌస్ నిర్వహించబడుతుంది. భారత జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే, కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ప్రత్యేకంగా తమ సమస్యల పరిష్కారం కోసం వచచేవారు, తమ పూర్తి పేరు (పాస్‌పోర్టులో వున్న విధంగా), సివిల్ ఐడీ, పాస్‌పోర్టు నెంబర్, కాంటాక్ట్ నెంబర్ మరియు అడ్రస్ (కువైట్‌లోనిది) [email protected] కి మెయిల్ చేయాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com