ఆ ప్రధాన నగరం సైతం మా హస్తగతం - రష్యా
- April 21, 2022
మాస్కో: రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరమైన మరియపోల్ను ఆక్రమించేసినట్లు రష్యా వెల్లడించింది. అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్ మినహా ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇవాళ రష్యా ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే స్టీల్ ప్లాంట్లో మాత్రం ఇంకా రెండు వేల మంది ఉక్రెయిన్ మిలిటెంట్లు ఉన్నట్లు రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ తెలిపారు.
మార్చిలో మరియపోల్ను చట్టుముట్టిన సమయంలో ఆ ప్లాంట్లో సుమారు 8 వేల మంది ఉక్రెయిన్ సైనికులు, విదేశీ దౌత్యవేత్తలు, మిలిటెంట్లతో పాటు అజోవ్ బెటాలియన్ ఉన్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 1400 మంది మిలిటెంట్లు తమ ఆయుధాలను వదిలేశారన్నారు. ఆ నగరం నుంచి 1.42 లక్షల మందిని సురక్షితంగా తరలించినట్లు షొయిగూ తెలిపారు.
అయితే అజోవ్ స్టీల్ ప్లాంట్ను ఆక్రమించాలన్న ఆలోచనను విరమించాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించినట్లు మంత్రి షొయిగూ చెప్పారు. కానీ ఆ ప్లాంట్ను సురక్షితంగా బ్లాక్ చేయాలని సూచించినట్లు వెల్లడించారు. ప్లాంట్ లోపల ఉన్న వారికి ఆయుధాలను విరమించేందుకు మరో అవకాశం ఇవ్వాలని పుతిన్ సూచించినట్లు చెప్పారు.
రష్యా దాడి చేపట్టిన తర్వాత మరియపోల్లో భీకర పోరు సాగిన విషయం తెలిసిందే. మరియపోల్లో విజయవంతంగా ఆపరేషన్ చేపట్టినందుకు పుతిన్ కంగ్రాట్స్ చెప్పినట్లు షొయిగూ తెలిపారు.
తాజా వార్తలు
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







