డిజిటల్ సభ్యత్వాలతో కాంగ్రెస్కు జోష్...
- April 22, 2022
న్యూ ఢిల్లీ: డిజిటల్ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ మంచి గణాంకాలనే నమోదు చేసింది.గత ఏడాది నవంబర్ 1న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటివరకు డిజిటల్గా 2.6 కోట్ల మంది సభ్యత్వాలు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రకటించింది.డిజిటల్ పద్ధతిలో కాంగ్రెస్ మెంబర్షిప్ కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి.ఈ ఏడాది నుంచి వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కాంగ్రెస్ డేటా అనలిస్టిక్ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ‘‘సభ్యత్వ నమోదు కోసం నాలుగు అంచెల ప్రక్రియను అనుసరించాం.పార్టీ అనుమతించిన నాయకులు మాత్రమే ఈ సభ్యత్వ నమోదు చేపట్టారు. పూర్తి పారదర్శకంగా ఈ కార్యక్రమం సాగింది. ఓటీపీ, వోటర్ ఐడీ ఆధారంగా, కార్యకర్తల ఫొటో తీసుకుని సభ్యత్వం ఇచ్చాం’’ అని ప్రవీణ్ చెప్పారు.ఈ కార్యక్రమం మరికొంతకాలం సాగుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?
- కువైట్ T4 కార్యకలాపాలు విస్తరణ..!!
- వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం
- సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం..జూన్ 29న హైకోర్టు డెడ్లైన్ పై ఉత్కంఠ!









