డిజిటల్ సభ్యత్వాలతో కాంగ్రెస్‌కు జోష్...

- April 22, 2022 , by Maagulf
డిజిటల్ సభ్యత్వాలతో కాంగ్రెస్‌కు జోష్...

న్యూ ఢిల్లీ: డిజిటల్ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ మంచి గణాంకాలనే నమోదు చేసింది.గత ఏడాది నవంబర్‌ 1న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటివరకు డిజిటల్‌గా 2.6 కోట్ల మంది సభ్యత్వాలు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రకటించింది.డిజిటల్ పద్ధతిలో కాంగ్రెస్ మెంబర్‌షిప్ కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి.ఈ ఏడాది నుంచి వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కాంగ్రెస్ డేటా అనలిస్టిక్ డిపార్ట్‌మెంట్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ‘‘సభ్యత్వ నమోదు కోసం నాలుగు అంచెల ప్రక్రియను అనుసరించాం.పార్టీ అనుమతించిన నాయకులు మాత్రమే ఈ సభ్యత్వ నమోదు చేపట్టారు. పూర్తి పారదర్శకంగా ఈ కార్యక్రమం సాగింది. ఓటీపీ, వోటర్ ఐడీ ఆధారంగా, కార్యకర్తల ఫొటో తీసుకుని సభ్యత్వం ఇచ్చాం’’ అని ప్రవీణ్ చెప్పారు.ఈ కార్యక్రమం మరికొంతకాలం సాగుతుందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com