డిజిటల్ సభ్యత్వాలతో కాంగ్రెస్కు జోష్...
- April 22, 2022
న్యూ ఢిల్లీ: డిజిటల్ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ మంచి గణాంకాలనే నమోదు చేసింది.గత ఏడాది నవంబర్ 1న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటివరకు డిజిటల్గా 2.6 కోట్ల మంది సభ్యత్వాలు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రకటించింది.డిజిటల్ పద్ధతిలో కాంగ్రెస్ మెంబర్షిప్ కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి.ఈ ఏడాది నుంచి వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కాంగ్రెస్ డేటా అనలిస్టిక్ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ‘‘సభ్యత్వ నమోదు కోసం నాలుగు అంచెల ప్రక్రియను అనుసరించాం.పార్టీ అనుమతించిన నాయకులు మాత్రమే ఈ సభ్యత్వ నమోదు చేపట్టారు. పూర్తి పారదర్శకంగా ఈ కార్యక్రమం సాగింది. ఓటీపీ, వోటర్ ఐడీ ఆధారంగా, కార్యకర్తల ఫొటో తీసుకుని సభ్యత్వం ఇచ్చాం’’ అని ప్రవీణ్ చెప్పారు.ఈ కార్యక్రమం మరికొంతకాలం సాగుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







