ఉగాదికి 'బాబు బంగారం'చిత్రం' ఫస్ట్ లుక్...
- April 05, 2016
వెంకటేష్, నయనతార నాయకా నాయికలుగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్ సంయుక్తంగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. 'వెంకటేష్, నయనతార మూడవ సారి జోడీ కడుతున్న చిత్రమిది. గతంలో 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల్లో కలిసి నటించారు. ఆ చిత్రాలు ఘన విజయం సాధించినట్లుగానే ఈ సినిమా కూడా అదే తరహాలో పెద్ద హిట్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.ఫస్ట్లుక్ని ఉగాది పర్వదిన శుభ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు మారుతి సినిమాను పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. జులైలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు







