అమరావతిలో ఉగాది రోజున బాలకృష్ణ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలు..
- April 05, 2016
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ నెల 8న హీరో బాలకృష్ణ తాను నటించబోయే వందవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలను వెల్లడించనున్నారు. అమరావతి (అప్పటి ధాన్య కటకం.. ఇప్పటి ధరణికోట రాజధానిగా చేసుకుని శాతవాహనులు సుధీర్ఘకాలం పరిపాలిం చారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతిగా నామ కరణం చేయడం సర్వజనామోదం పొందింది. శాతవాహన చివరి చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత వృత్తాంతాన్ని ప్రస్తుతం వెండితెరపైకి తీసు కువచ్చి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్నారు. శాతకర్ణి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా జాతీయ స్థాయి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన కంచె సినిమా దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బాలకృష్ణ నటించిన డిక్టేటర్ అమరావతిలో తొలిసారి ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఇది ఘన విజ యం సాధించింది. అదే సెంటిమెంట్తో ఉగాది పర్వదినం రోజున రాజధాని అమరావతిలో బాలకృష్ణ తన నూరవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలను ప్రకటించనున్నారు. ఈ సినిమాతో శా తవాహనుల చరిత్ర నేటి తరానికి తెలియనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







