అమరావతిలో ఉగాది రోజున బాలకృష్ణ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలు..
- April 05, 2016
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ నెల 8న హీరో బాలకృష్ణ తాను నటించబోయే వందవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలను వెల్లడించనున్నారు. అమరావతి (అప్పటి ధాన్య కటకం.. ఇప్పటి ధరణికోట రాజధానిగా చేసుకుని శాతవాహనులు సుధీర్ఘకాలం పరిపాలిం చారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతిగా నామ కరణం చేయడం సర్వజనామోదం పొందింది. శాతవాహన చివరి చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత వృత్తాంతాన్ని ప్రస్తుతం వెండితెరపైకి తీసు కువచ్చి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్నారు. శాతకర్ణి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా జాతీయ స్థాయి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన కంచె సినిమా దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బాలకృష్ణ నటించిన డిక్టేటర్ అమరావతిలో తొలిసారి ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఇది ఘన విజ యం సాధించింది. అదే సెంటిమెంట్తో ఉగాది పర్వదినం రోజున రాజధాని అమరావతిలో బాలకృష్ణ తన నూరవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలను ప్రకటించనున్నారు. ఈ సినిమాతో శా తవాహనుల చరిత్ర నేటి తరానికి తెలియనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







