డ్రైవింగ్: ఆల్కహాల్ కన్నా మొబైల్ ఫోన్ ప్రమాదకరం
- April 05, 2016
డ్రైవింగ్ సమయంలో ఆల్కహాల్ కన్నా మొబైల్ ఫోన్ ప్రమాదకరమని వివిధ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రాయల్ ఒమన్ పోలీసులు ఈ అంశాన్ని ధృవీకరించారు. ఆల్కహాల్ సేవించి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారికన్నా డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకం దారులే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడిపేవారికి 35 ఒమన్ రియాల్స్ ఫైన్ విధిస్తున్నారు. దీన్ని 300 ఒమన్ రియాల్స్కి పెంచడంతోపాటు నెల రోజుల నుంచి 2 ఏళ్ళ జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి వాహనాన్నీ తనిఖీలు చేయడం కుదరదనీ, ప్రమాదాల నివారణకు చైతన్యం పెంచడమే మార్గమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాయల్ ఒమన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







