వాహనాల శబ్దకాలుష్యంపై యూఏఈ కొరడా
- April 05, 2016వాహనాల ద్వారా విడుదలయ్యే శబ్దకాలుష్యంపై యూఏఈ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. అతి తీవ్రత గల శబ్ద కాలుష్యాన్ని గుర్తించేందుకు రోడ్లపై రాడార్లను అమర్చుతున్నారు. ఈ రాడార్లు శబ్ద కాలుష్యాన్ని వెదజల్లే వాహనాల్ని గుర్తిస్తాయని అధికారులు చెప్పారు. ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ అబుదాబీ పోలీస్ హెడ్ కెప్టెన్ అహ్మద్ అబ్దుల్లా అల్ ముహైరి ఈ రాడార్ని కనుగొన్నారు. ఇందులోని సౌండ్ ఇంటెన్సిటీ సెన్సార్ నిబంధనల్ని ఉల్లంఘించే వాహనాన్ని గుర్తించి, ఫొటోలు తీస్తుందని చెప్పారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చలాన్లు విధించడం ద్వారా, శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తామని అధికారులు వివరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా శబ్ద కాలుష్యాన్ని డిటెక్ట్ చేసే రాడార్ని ఉపయోగిస్తున్న ఘనత అబుదాబీకి దక్కుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్