వాహనాల శబ్దకాలుష్యంపై యూఏఈ కొరడా
- April 05, 2016
వాహనాల ద్వారా విడుదలయ్యే శబ్దకాలుష్యంపై యూఏఈ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. అతి తీవ్రత గల శబ్ద కాలుష్యాన్ని గుర్తించేందుకు రోడ్లపై రాడార్లను అమర్చుతున్నారు. ఈ రాడార్లు శబ్ద కాలుష్యాన్ని వెదజల్లే వాహనాల్ని గుర్తిస్తాయని అధికారులు చెప్పారు. ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ అబుదాబీ పోలీస్ హెడ్ కెప్టెన్ అహ్మద్ అబ్దుల్లా అల్ ముహైరి ఈ రాడార్ని కనుగొన్నారు. ఇందులోని సౌండ్ ఇంటెన్సిటీ సెన్సార్ నిబంధనల్ని ఉల్లంఘించే వాహనాన్ని గుర్తించి, ఫొటోలు తీస్తుందని చెప్పారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చలాన్లు విధించడం ద్వారా, శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తామని అధికారులు వివరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా శబ్ద కాలుష్యాన్ని డిటెక్ట్ చేసే రాడార్ని ఉపయోగిస్తున్న ఘనత అబుదాబీకి దక్కుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









