వాహనాల శబ్దకాలుష్యంపై యూఏఈ కొరడా
- April 05, 2016
వాహనాల ద్వారా విడుదలయ్యే శబ్దకాలుష్యంపై యూఏఈ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. అతి తీవ్రత గల శబ్ద కాలుష్యాన్ని గుర్తించేందుకు రోడ్లపై రాడార్లను అమర్చుతున్నారు. ఈ రాడార్లు శబ్ద కాలుష్యాన్ని వెదజల్లే వాహనాల్ని గుర్తిస్తాయని అధికారులు చెప్పారు. ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ అబుదాబీ పోలీస్ హెడ్ కెప్టెన్ అహ్మద్ అబ్దుల్లా అల్ ముహైరి ఈ రాడార్ని కనుగొన్నారు. ఇందులోని సౌండ్ ఇంటెన్సిటీ సెన్సార్ నిబంధనల్ని ఉల్లంఘించే వాహనాన్ని గుర్తించి, ఫొటోలు తీస్తుందని చెప్పారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చలాన్లు విధించడం ద్వారా, శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తామని అధికారులు వివరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా శబ్ద కాలుష్యాన్ని డిటెక్ట్ చేసే రాడార్ని ఉపయోగిస్తున్న ఘనత అబుదాబీకి దక్కుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







