వాహనాల శబ్దకాలుష్యంపై యూఏఈ కొరడా
- April 05, 2016
వాహనాల ద్వారా విడుదలయ్యే శబ్దకాలుష్యంపై యూఏఈ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. అతి తీవ్రత గల శబ్ద కాలుష్యాన్ని గుర్తించేందుకు రోడ్లపై రాడార్లను అమర్చుతున్నారు. ఈ రాడార్లు శబ్ద కాలుష్యాన్ని వెదజల్లే వాహనాల్ని గుర్తిస్తాయని అధికారులు చెప్పారు. ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ అబుదాబీ పోలీస్ హెడ్ కెప్టెన్ అహ్మద్ అబ్దుల్లా అల్ ముహైరి ఈ రాడార్ని కనుగొన్నారు. ఇందులోని సౌండ్ ఇంటెన్సిటీ సెన్సార్ నిబంధనల్ని ఉల్లంఘించే వాహనాన్ని గుర్తించి, ఫొటోలు తీస్తుందని చెప్పారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చలాన్లు విధించడం ద్వారా, శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తామని అధికారులు వివరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా శబ్ద కాలుష్యాన్ని డిటెక్ట్ చేసే రాడార్ని ఉపయోగిస్తున్న ఘనత అబుదాబీకి దక్కుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







