‘స్కాలర్షిప్’ రీఫండ్ చేయాలని మహిళను ఆదేశించిన కోర్టు
- May 07, 2022
బహ్రెయిన్: ‘స్కాలర్షిప్’ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఓ మహిళను బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ నుండి యూరప్లో మాస్టర్స్ డిగ్రీ కోసం స్కాలర్షిప్గా పొందిన BD60,000 తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ బహ్రెయిన్ మహిళ దాఖలు చేసిన అప్పీల్ను హై అప్పీల్స్ కోర్టు తాజా తిరస్కరించింది. ముందుగా చేసుకన్న ఒప్పందం ప్రకారం.. స్కాలర్షిప్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి తన చదువు పూర్తి అయిన తర్వాత విశ్వవిద్యాలయంలో పని చేయడానికి సదరు మహిళ నిరాకరించింది. దీంతో స్కాలర్ షిప్ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ కోర్టును ఆశ్రయించింది. యూనివర్సిటీలో ఉద్యోగం చేసేందుకు తనకు ఆరోగ్య సమస్యలు అడ్డుపడుతున్నాయని మహిళ న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే, స్కాలర్షిప్ గడువు ముగిసిన రెండేళ్ల తర్వాత ఆమె తన అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ నకిలీ మెడికల్ సర్టిఫికేట్లను సమర్పించిందని విశ్వవిద్యాలయం రుజువు చేయడంతో కోర్టు ఆమె వాదనను తిరస్కరించింది
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







