‘స్కాలర్షిప్’ రీఫండ్ చేయాలని మహిళను ఆదేశించిన కోర్టు
- May 07, 2022
బహ్రెయిన్: ‘స్కాలర్షిప్’ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఓ మహిళను బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ నుండి యూరప్లో మాస్టర్స్ డిగ్రీ కోసం స్కాలర్షిప్గా పొందిన BD60,000 తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ బహ్రెయిన్ మహిళ దాఖలు చేసిన అప్పీల్ను హై అప్పీల్స్ కోర్టు తాజా తిరస్కరించింది. ముందుగా చేసుకన్న ఒప్పందం ప్రకారం.. స్కాలర్షిప్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి తన చదువు పూర్తి అయిన తర్వాత విశ్వవిద్యాలయంలో పని చేయడానికి సదరు మహిళ నిరాకరించింది. దీంతో స్కాలర్ షిప్ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ కోర్టును ఆశ్రయించింది. యూనివర్సిటీలో ఉద్యోగం చేసేందుకు తనకు ఆరోగ్య సమస్యలు అడ్డుపడుతున్నాయని మహిళ న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే, స్కాలర్షిప్ గడువు ముగిసిన రెండేళ్ల తర్వాత ఆమె తన అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ నకిలీ మెడికల్ సర్టిఫికేట్లను సమర్పించిందని విశ్వవిద్యాలయం రుజువు చేయడంతో కోర్టు ఆమె వాదనను తిరస్కరించింది
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







