మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో ముగ్గురు భారతీయులు గెలుపు
- May 07, 2022దుబాయ్: దుబాయ్ లో తాజాగా నిర్వహించిన మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో ముగ్గురు భారతీయులు గెలుపొందారు.ఒకరు ఖరీదైన న్యూ బ్రాండ్ SUV వాహనం గెలుచుకోగా, మరో ఇద్దరు చెరో లక్ష దిర్హాములు సొంతం చేసుకున్నారు.ఈద్ సందర్భంగా తాజాగా దుబాయ్లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఇలా ముగ్గురు భారత ప్రవాసులకు ఒకేసారి అదృష్టం వరించింది. వివరాల్లోకి వెళ్తే... షార్జాలో ఉండే భారతీయ వ్యాపారవేత్త ఖలీద్ గత కొన్నేళ్లుగా మహజూజ్ ర్యాఫిల్ లో పాల్గొంటున్నాడు.దీనిలో భాగంగా ఈద్కు కొన్నిరోజుల ముందు అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం:13166467 ఖలీద్కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దాంతో అతడు ఖరీదైన SUV వాహనాన్ని గెలిచాడు. ఈ సందర్భంగా ఖలీద్ మాట్లాడుతూ.. "26 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాను.గత కొన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా మహజూజ్ రాఫెల్లో పాల్గొంటున్నా.ఏదో ఒకరోజు తాను పెద్ద బహుమతి గెలుస్తానని నమ్మాను. ఇప్పుడు నా నమ్మకం నిజమైంది. నిస్సాన్ SUV వాహనం గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. తాను లాటరీలో విజేతగా నిలిచినట్లు మొదట నా మేనల్లుడు ఫోన్ చేసి చెప్పడంతో ఎగిరి గంతేసినంత పని చేశాను" అని ఖలీద్ చెప్పుకొచ్చాడు.
మరో భారత ప్రవాసుడు మహ్మద్(26) కూడా ఇదే డ్రాలో లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు. దుబాయ్లోని డౌన్టౌన్లో జూస్ మేకర్గా పని చేసే మహ్మద్ ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఖతార్లో ఉండే తన సోదరుడు మొదట తనకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెప్పాడు. ఏడాది కాలంగా తాను మహజూజ్ రాఫెల్లో పాల్గొంటున్నానని, కానీ ఇంత త్వరగా తనకు అదృష్టం కలిసివస్తుందనుకోలేదంటూ మహ్మద్ మురిసిపోయాడు.ఇక తాను గెలిచిన ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని సొంతూరిలోని తన ఇంటిని బాగు చేయించడానికి వినియోగించనున్నట్లు తెలిపాడు.మహ్మద్తో పాటు ఒమన్లో ఉండే మరో భారత వ్యక్తి అనీష్(33) కూడా ఇదే వీక్లీ డ్రాలో సేమ్ ప్రైజ్మనీ లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..