మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో ముగ్గురు భారతీయులు గెలుపు
- May 07, 2022దుబాయ్: దుబాయ్ లో తాజాగా నిర్వహించిన మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో ముగ్గురు భారతీయులు గెలుపొందారు.ఒకరు ఖరీదైన న్యూ బ్రాండ్ SUV వాహనం గెలుచుకోగా, మరో ఇద్దరు చెరో లక్ష దిర్హాములు సొంతం చేసుకున్నారు.ఈద్ సందర్భంగా తాజాగా దుబాయ్లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఇలా ముగ్గురు భారత ప్రవాసులకు ఒకేసారి అదృష్టం వరించింది. వివరాల్లోకి వెళ్తే... షార్జాలో ఉండే భారతీయ వ్యాపారవేత్త ఖలీద్ గత కొన్నేళ్లుగా మహజూజ్ ర్యాఫిల్ లో పాల్గొంటున్నాడు.దీనిలో భాగంగా ఈద్కు కొన్నిరోజుల ముందు అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం:13166467 ఖలీద్కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దాంతో అతడు ఖరీదైన SUV వాహనాన్ని గెలిచాడు. ఈ సందర్భంగా ఖలీద్ మాట్లాడుతూ.. "26 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాను.గత కొన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా మహజూజ్ రాఫెల్లో పాల్గొంటున్నా.ఏదో ఒకరోజు తాను పెద్ద బహుమతి గెలుస్తానని నమ్మాను. ఇప్పుడు నా నమ్మకం నిజమైంది. నిస్సాన్ SUV వాహనం గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. తాను లాటరీలో విజేతగా నిలిచినట్లు మొదట నా మేనల్లుడు ఫోన్ చేసి చెప్పడంతో ఎగిరి గంతేసినంత పని చేశాను" అని ఖలీద్ చెప్పుకొచ్చాడు.
మరో భారత ప్రవాసుడు మహ్మద్(26) కూడా ఇదే డ్రాలో లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు. దుబాయ్లోని డౌన్టౌన్లో జూస్ మేకర్గా పని చేసే మహ్మద్ ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఖతార్లో ఉండే తన సోదరుడు మొదట తనకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెప్పాడు. ఏడాది కాలంగా తాను మహజూజ్ రాఫెల్లో పాల్గొంటున్నానని, కానీ ఇంత త్వరగా తనకు అదృష్టం కలిసివస్తుందనుకోలేదంటూ మహ్మద్ మురిసిపోయాడు.ఇక తాను గెలిచిన ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని సొంతూరిలోని తన ఇంటిని బాగు చేయించడానికి వినియోగించనున్నట్లు తెలిపాడు.మహ్మద్తో పాటు ఒమన్లో ఉండే మరో భారత వ్యక్తి అనీష్(33) కూడా ఇదే వీక్లీ డ్రాలో సేమ్ ప్రైజ్మనీ లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?