ముంబై వడ పావ్
- May 07, 2022
ముంబై వడ పావ్
కావలసిన పదార్థాలు : 1 ఇంచ్ అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చి మిర్చి, 1 టేబుల్స్పూన్ ఆయిల్,3/4 టీస్పూన్ ఆవాలు,1/4 టీస్పూన్ ఇంగువ, 12-15 కరివేపాకు, 4 మీడియం పొటాటోస్(ఉడకపెట్టి, తొక్కు తీసి, మాష్ చేసినవి),1/4 టీస్పూన్ పసుపు, ఉప్పు తగినంత, 2 టేబుల్స్పూన్స్ కొత్తిమీర.
1 కప్ సెనగపిండి, 1/4 టీస్పూన్ పసుపు,1/2 టీస్పూన్ సాల్ట్ , 1 పించ్ బేకింగ్ సోడా, డీప్ ఫ్రై చెయ్యటానికి పిండి కలపటానికి తగినంత నీరు.స్పైసీ చట్నీ కి కావలసినవి 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం.
ముంబై పావ్ బన్స్ -6
చెయ్యవలసిన విధానం: ముందర అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి గ్రైండ్ చేసి పెట్టు కోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆవాలు వేసి చిటపట లాడాక, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి అర నిమిషం వేగాక , గ్రైండ్ చేసిన ముద్ద వేసి, ఇంకో అర నిమిషం వేగాక, ఉడికించిన
బంగాళాదుంప, రుచికి సరిపడా ఉప్పు వేసి, బాగా కలియపెట్టి, 2 నిమిషాలు అయ్యాక కొత్తి మీర వేసి స్టవ్ ఆపి . చల్లార నివ్వాలి.
సెనగపిండి,పసుపు,సాల్ట్ , చిటికెడు సోడా తగినంత నీరు పోసి పిండి బోండా వేసే కన్సిస్టెన్సీ లో కలుపుకొని , ఒక పావు గంట మూత పెట్టి ఉంచాలి.
స్టవ్ మీద బాణాలి లో డీప్ ఫ్రై కి సరి పడా ఆయిల్ పోసుకుని, కాగాక, అయిదు వేళ్ళు పిండిలో ఉంచి నూనె లోకి జార విడచాలి. అప్పుడు అది బూందీ లాగ, కొంచెం పొడుగు పొడుగు గా vegaaka తీసి పక్కన పెట్టాలి. రెండు వాయలు ఇలా చేస్తే చాలు. ఇవి చల్లారాక వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి, గ్రైండర్ లో పొడి చేసి పెట్టుకోవాలి.
తయారు చేసి పెట్టుకున్న బంగాళాదుంప కూర ని చిన్న ఉండలు గా చేసి, పిండి లో ముంచి బోండాలు లాగ చేసి వేయించాలి.ఇప్పుడు పావ్ బన్స్ ని మధ్యలో స్ప్లిట్ చేసి,ఒక స్పూన్ స్పైసి చట్నీ వేసి, బటాటా వడ పెట్టి తింటే ..రుచి అదుర్స్..
వి.జానకి జ్యోతి, సింగపూర్.
తాజా వార్తలు
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్









