కార్మికుడికి 120,000 దిర్హాములు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశం
- May 07, 2022
అబుధాబి: అబుధాబి న్యాయస్థానం, ఓ సంస్థ తమ కార్మికుడికి 120,000 దిర్హాములు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. విల్లాలో కిటికీలు అమర్చుతుండగా ఎత్తయిన ప్రాంతం నుంచి కార్మికుడు కింద పడిపోయాడు. బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడికి శాశ్వత వైకల్యం సంభవించినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. గతంలో న్యాయస్థానం 40,000 దిర్హాములు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించగా, ఇప్పుడది 120,000 దిర్హాములకు పెరిగింది. నష్ట పరిహారాన్ని తగ్గించాల్సిందిగా సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









