మొహర్రాక్లో మొదటి మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ ప్రారంభం
- May 08, 2022
మనామా: ముహర్రక్లోని పెరల్ పాత్లో మొదటి మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ను బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ (BACA) ఆదివారం ప్రారంభించనుంది. పెర్ల్ పాత్లో మరో మూడు మల్టీ స్టోర్ పార్కులు కూడా 2022 చివరి నాటికి లేదా 2023 ప్రారంభంలో పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. ఆర్సినల్స్ ఇంజినీరింగ్ డిజైన్ సహకారంతో ఆర్కిటెక్ట్ క్రిస్టియన్ కెరెజ్ ఈ నిర్మాణాలను రూపొందించారు. కొత్త పార్కింగ్ లాట్లోని ప్రతి ఫ్లోర్ విభిన్నమైన ఆకృతిని, డిజైన్ను కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టులను ప్రముఖ నిర్మాణ కంపెనీ అయిన అబ్దుల్మోసెన్ అల్ ఖరాఫీ అండ్ సన్స్ నిర్మిస్తోంది. పెర్ల్ పాత్ బహ్రెయిన్ కోట తర్వాత యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ఎక్కిన రెండవ ఐకానిక్ వెస్టేజ్ గా గుర్తింపు పొందింది. నగరంలోని నివాసితులు, సందర్శకులకు పెరల్ పాత్ ప్రదేశానికి పార్కింగ్ను అందించడం, ముహరక్ సిటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









