చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ను షేర్ చేస్తే 10 మిలియన్ల జరిమానా
- May 08, 2022
యూఏఈ: చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్లో భాగం కావడం లేదా స్టోర్ చేయడం, దాన్ని షేర్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే Dh300,000 నుంచి గరిష్టంగా Dh10 మిలియన్ల వరకు పెనాల్టీని విధించనున్నట్లు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఫెడరల్ డిక్రీ లా 34 2021లోని ఆర్టికల్ 53 ప్రకారం పుకార్లు, ఇ-క్రైమ్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా జరిమానాలు విధించబడ్డాయని పేర్కొంది. చట్టం ప్రకారం, చట్టవిరుద్ధమైన కంటెంట్ను స్టోర్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి లేదా ప్రచురించడానికి ఆన్లైన్ వెబ్సైట్ లేదా ఖాతాను ఉపయోగించే ఎవరైనా, అధికారిక ఆర్డర్లలో పేర్కొన్న వ్యవధిలో అటువంటి మెటీరియల్ను తొలగించాలని, లేదంటే జరిమానా విధించబడుతుందని అందులో పేర్కొన్నారు. అలాగే డిక్రీలో పేర్కొన్న కంటెంట్ను తీసివేయడానికి పూర్తిగా లేదా పాక్షికంగా నిరాకరించిన వ్యక్తి కూడా శిక్షకు బాధ్యుడు అవుతాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









