చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ను షేర్ చేస్తే 10 మిలియన్ల జరిమానా
- May 08, 2022
యూఏఈ: చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్లో భాగం కావడం లేదా స్టోర్ చేయడం, దాన్ని షేర్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే Dh300,000 నుంచి గరిష్టంగా Dh10 మిలియన్ల వరకు పెనాల్టీని విధించనున్నట్లు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఫెడరల్ డిక్రీ లా 34 2021లోని ఆర్టికల్ 53 ప్రకారం పుకార్లు, ఇ-క్రైమ్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా జరిమానాలు విధించబడ్డాయని పేర్కొంది. చట్టం ప్రకారం, చట్టవిరుద్ధమైన కంటెంట్ను స్టోర్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి లేదా ప్రచురించడానికి ఆన్లైన్ వెబ్సైట్ లేదా ఖాతాను ఉపయోగించే ఎవరైనా, అధికారిక ఆర్డర్లలో పేర్కొన్న వ్యవధిలో అటువంటి మెటీరియల్ను తొలగించాలని, లేదంటే జరిమానా విధించబడుతుందని అందులో పేర్కొన్నారు. అలాగే డిక్రీలో పేర్కొన్న కంటెంట్ను తీసివేయడానికి పూర్తిగా లేదా పాక్షికంగా నిరాకరించిన వ్యక్తి కూడా శిక్షకు బాధ్యుడు అవుతాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









