దుబాయ్ లో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయిన భారతీయుడు
- May 10, 2022అబుధాబి: భారత్ నుంచి దుబాయ్ వెళ్లిన భారతీయుడు జాక్ పాటు కొట్టాడు.దీనికి కారణం అతని కుమారుడి పుట్టినరోజు. కుమారుడి పుట్టినరోజే అతడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసేసింది.వివరాల్లోకి వెళ్తే.. భారత్ లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన దక్షిణమూర్తి మీనాచి సుందరం(29) అనే వ్యక్తి గత 9 ఏళ్లుగా యూఏఈలో నివసిస్తున్నాడు.అక్కడ ఓ గృహనిర్మాణ సంస్థలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు.నెలకు 2,500 దిర్హాములు జీతం వస్తుంది.కాగా, దక్షిణమూర్తి గత ఐదేళ్లుగా అబుదాబి బిగ్టికెట్ ర్యాఫిల్ లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.ఈ క్రమంలో ఇటీవల తన కుమారుడి పుట్టిన తేదీ కలిసొచ్చేలా ఓ లాటరీ టికెట్ కొన్నాడు.తాజాగా అబుధాబిలో నిర్వహించిన వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రాలో అతడు కొనుగోలు చేసినా టికెట్ నంబర్కే లాటరీ తగిలింది. దాంతో ఏకంగా 500,000 దిర్హాములు గెలుచుకున్నాడు.ఇలా కొడుకు బర్త్డే దక్షిణమూర్తికి అదృష్టాన్ని తెచ్చిపెట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా అవతరించారు.దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు.
ఈ సందర్భంగా దక్షిణమూర్తి మాట్లాడుతూ.. "9 ఏళ్ల నుంచి యూఏఈలో ఉంటున్నా. గడిచిన ఐదేళ్ల నుంచి క్రమం తప్పకుండా బిగ్టికెట్ ర్యాఫిల్ లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాను.ఏదో ఒకరోజు నాకు అదృష్టం వరిస్తుంది,పెద్ద మొత్తం గెలుస్తాననే ఆశతో లాటరీ టికెట్లు కొంటూ వచ్చాను.చాలాసార్లు స్నేహితులతో కలిసి లాటరీ టికెట్లు కొన్నాను. కానీ, ఈసారి సొంతంగా నా కుమారుడి పుట్టిన తేదీ కలిసొచ్చేలా లాటరీ టికెట్ నంబర్ను ఎంచుకున్నాను. ఇవాళ అదే నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మే 2వ తేదీన నేను కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం: 065245 నన్ను విజేతను చేసింది.నా కుమారుడి పుట్టిన తేదీ 24-05-2021.లాటరీ టికెట్లోని చివరి మూడు నెంబర్లు 245..నా కుమారుడి పుట్టిన తేదీలోని 24-5 ఒక్కటే.ఇదే లాజిక్తో లాటరీ టికెట్ కొనడం.. అది కాస్తా నన్ను విజేతను చేయడం జరిగిపోయాయి." అని దక్షిణమూర్తి చెప్పుకొచ్చాడు.అతడి స్వస్థలం తమిళనాడులోని మదురై. ప్రస్తుతం భార్య, కుమారుడు భారత్లోనే ఉన్నారు. ఇప్పుడు తాను గెలిచిన ఈ భారీ మొత్తంతో తన జీవితమే మారిపోతుందన్నాడు.వెంటనే స్వదేశం నుంచి తన భార్య, కుమారుడిని యూఏఈకి తెచ్చుకుంటానని తెలిపాడు. మాది సాధారణ కుటుంబం. నా జీవితం సురక్షితం, కానీ నేను ఇక్కడ ఈ కంపెనీలో పని చేస్తూనే ఉంటాను.ఇక్కడ పని చేయడం నా అదృష్టం. కాబట్టి, నేను ఇక్కడే ఉండి పని చేస్తానని చెప్పాడు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..