కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సమావేశం..
- May 10, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో మే 11 న బుధవారం నాడు ఓపెన్ హౌస్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. భారత రాయబారి సిబి జార్జ్ ఈ కార్యక్రమం ద్వారా కువైట్ లోని భారత ప్రవాసుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చిస్తారు.ఫహహీల్లోని బీఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ సెంటర్లో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.కువైట్ లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్లో పాల్గొనడానికి ఆహ్వానితులే.అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి.ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్ఫారమ్లో నిర్వహించడం లేదని రాయబార కార్యాలయం వెల్లడించింది.కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా ఫహహీల్లోని బీఎల్ఎస్ ఔట్సోర్సింగ్ సెంటర్కు వెళ్లాల్సి ఉంటుంది.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్పోర్టు నం.,సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైట్ లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన [email protected] కు ఈ-మెయిల్ చెయ్యాలి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









