భారత్లో పర్యటించనున్న ఒమనీ వాణిజ్య ప్రతినిధి బృందం
- May 11, 2022
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) ప్రతినిధి బృందం భారత్ లో పర్యటించనుంది. భారత పర్యటనలో పాల్గొంటున్న వారిలో ఒమన్ సుల్తానేట్లోని వివిధ ఆర్థిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఉన్నారు. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ రిధా బిన్ జుమా అల్ సలేహ్ ఒమన్ పర్యటనకు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా భారత ప్రభుత్వం, అనేక మంది అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం సజావుగా సాగేందుకు అవసరమైన విధానాల గురించి వీరు చర్చలు జరుపుతారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి అవకాశాలు, సౌకర్యాలను పరిచయం చేసే లక్ష్యంతో "ఇన్వెస్ట్ ఇన్ ఒమన్" ఫోరమ్ ను నిర్వహిస్తారు. వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించే మార్గాలను చర్చించడానికి ఇరు దేశాల వ్యాపారవేత్తల మధ్య ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నట్లు అల్ సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









