భారత్లో పర్యటించనున్న ఒమనీ వాణిజ్య ప్రతినిధి బృందం
- May 11, 2022
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) ప్రతినిధి బృందం భారత్ లో పర్యటించనుంది. భారత పర్యటనలో పాల్గొంటున్న వారిలో ఒమన్ సుల్తానేట్లోని వివిధ ఆర్థిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఉన్నారు. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ రిధా బిన్ జుమా అల్ సలేహ్ ఒమన్ పర్యటనకు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా భారత ప్రభుత్వం, అనేక మంది అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం సజావుగా సాగేందుకు అవసరమైన విధానాల గురించి వీరు చర్చలు జరుపుతారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి అవకాశాలు, సౌకర్యాలను పరిచయం చేసే లక్ష్యంతో "ఇన్వెస్ట్ ఇన్ ఒమన్" ఫోరమ్ ను నిర్వహిస్తారు. వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించే మార్గాలను చర్చించడానికి ఇరు దేశాల వ్యాపారవేత్తల మధ్య ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నట్లు అల్ సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







