భారత్లో పర్యటించనున్న ఒమనీ వాణిజ్య ప్రతినిధి బృందం
- May 11, 2022మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) ప్రతినిధి బృందం భారత్ లో పర్యటించనుంది. భారత పర్యటనలో పాల్గొంటున్న వారిలో ఒమన్ సుల్తానేట్లోని వివిధ ఆర్థిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఉన్నారు. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ రిధా బిన్ జుమా అల్ సలేహ్ ఒమన్ పర్యటనకు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా భారత ప్రభుత్వం, అనేక మంది అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం సజావుగా సాగేందుకు అవసరమైన విధానాల గురించి వీరు చర్చలు జరుపుతారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి అవకాశాలు, సౌకర్యాలను పరిచయం చేసే లక్ష్యంతో "ఇన్వెస్ట్ ఇన్ ఒమన్" ఫోరమ్ ను నిర్వహిస్తారు. వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించే మార్గాలను చర్చించడానికి ఇరు దేశాల వ్యాపారవేత్తల మధ్య ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నట్లు అల్ సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు