ఉత్తర కొరియాలో కరోనా కలకలం..తొలి కరోనా మరణం
- May 13, 2022
సియోలా: ఉత్తరకొరియాలో కరోనా తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే.ఇప్పుడు మరి కొంత మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.అంతేకాదు,ఓ కరోనా బాధితుడు మృతి చెందాడని ఉత్తరకొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ప్యాంగాంగ్ లో తాజాగా జ్వరంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా..వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు స్పష్టమైంది. మృతుడిలో ఒమిక్రాన్ బీఏ.2ను గుర్తించారు.
ఉత్తరకొరియాలో ప్రస్తుతం 1,87,800 మంది జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు.వారందరినీ ఐసోలేషన్ లో ఉంచినట్లు వివరించారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్డౌన్ విధించారు.అక్కడ ఇంకా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదు.వ్యాక్సిన్ లు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినప్పటికీ ఉత్తరకొరియా ఇంతకు ముందు తిరస్కరించింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







