ఉత్తర కొరియాలో కరోనా కలకలం..తొలి కరోనా మరణం
- May 13, 2022
సియోలా: ఉత్తరకొరియాలో కరోనా తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే.ఇప్పుడు మరి కొంత మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.అంతేకాదు,ఓ కరోనా బాధితుడు మృతి చెందాడని ఉత్తరకొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ప్యాంగాంగ్ లో తాజాగా జ్వరంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా..వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు స్పష్టమైంది. మృతుడిలో ఒమిక్రాన్ బీఏ.2ను గుర్తించారు.
ఉత్తరకొరియాలో ప్రస్తుతం 1,87,800 మంది జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు.వారందరినీ ఐసోలేషన్ లో ఉంచినట్లు వివరించారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్డౌన్ విధించారు.అక్కడ ఇంకా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదు.వ్యాక్సిన్ లు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినప్పటికీ ఉత్తరకొరియా ఇంతకు ముందు తిరస్కరించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







