ఉక్రెయిన్ విడిచి వెళ్లిన 60 లక్షల మంది: ఐరాస
- May 13, 2022జెనీవా : ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు. ఉక్రెయిన్ మొత్తం జనాభా 3 కోట్ల 70 లక్షలుగా ఉండగా, ఇప్పటివరకు మొత్తం 60 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ ను వదిలి ఇతర దేశాలకు వెళ్లారని ఐక్యరాజ్య సమితి తాజాగా తెలిపింది. వారిలో మహిళలు, పిల్లలే 90 శాతం మంది ఉన్నారని వివరించింది.
ఉక్రెయిన్ నుంచి అధిక మంది పోలండ్ కు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారని, పురుషులు యుద్ధంలో పాల్గొనాల్సి ఉండడంతో ఉక్రెయిన్లోనే ఉంటుందున్నారని పేర్కొంది. ఉక్రెయిన్ లో మరో 80 లక్షల మంది సొంత దేశంలో పలు ప్రాంతాలకు మారారని తెలిపింది. ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దులు దాటుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని చెప్పింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. మార్చి నెలలో ఉక్రెయిన్ నుంచి 30 లక్షల మందికి పైగా ప్రజలు విదేశాలకు వెళ్లారు. ఏప్రిల్ నాటికి వలస వెళ్లిన వారి సంఖ్య 10 లక్షల మందికి పైగా చేరింది. ఈ నెల 4,93,000 మంది ఉక్రెయిన్ సరిహద్దులు దాటారు. 2022 ముగిసేలోపు మొత్తం 80 లక్షల మంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు