యూఏఈ అధ్యక్షుని అంత్యక్రియలు పూర్తి
- May 14, 2022అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ మసీదులో దివంగత షేక్ ఖలీఫా భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
అల్ నహ్యాన్ కుటుంబానికి చెందిన పలువురు షేక్లతో పాటు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ కూడా అల్ బతీన్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియలలో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని మరియు స్వర్గంలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించాలని సర్వశక్తిమంతుడైన అల్లాను ప్రార్థించారు.
యూఏఈ లోని ప్రజలందరూ దివంగత రాజుకి ప్రత్యేక ప్రార్ధలను మసీదుల్లో నిర్వహించారు.
అబుధాబి క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ శనివారం నాడు ముష్రిఫ్ ప్యాలెస్లో ఎమిరేట్స్ పాలకులు మరియు సీనియర్ అధికారుల నుండి సంతాపాన్ని స్వీకరిస్తారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ