యూఏఈకి సంతాపాన్ని తెలిపిన ఒమన్ సుల్తాన్

- May 14, 2022 , by Maagulf
యూఏఈకి సంతాపాన్ని తెలిపిన ఒమన్ సుల్తాన్

మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దివంగత అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి పట్ల ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాపం తెలిపారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, రాజకుమారుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌కు సుల్తాన్ హైతం బిన్ తారిక్ తన సానుభూతిని తెలియజేశారు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దివంగత ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com