షేక్ ఖలీఫా మరణంపై సంతాపం తెలిపిన రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్
- May 14, 2022జెడ్డా: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ మరణంపై.. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి, అల్-నహ్యాన్ కుటుంబానికి, సోదర ఎమిరాటీ ప్రజలకు, అరబ్- ఇస్లామిక్ దేశాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ మరణ వార్త తెలిసిన వెంటనే కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ విచారంలో మునిగిపోయారని వారి కార్యాలయం తెలిపింది. తన ప్రజలకు, తన దేశానికి, ప్రపంచానికి చాలా అందించిన నాయకుడు షేక్ ఖలీఫా అంటూ తమ సందేశాల్లో వారు కొనియాడారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు క్రౌన్ ప్రిన్స్ ఫోన్ చేసి పరామర్శించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ