హజ్ కోసం దరఖాస్తు చేసుకున్న 23,474 మంది
- May 16, 2022
మస్కట్: ఈ సంవత్సరం మొత్తం 23,474 మంది హజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఒమానీల నుండి 21,429 దరఖాస్తులు రాగా.. నివాసితుల నుండి 2,045 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది సుల్తానేట్కు మంజూరు చేసిన 6,388 కోటాకు ఇది దాదాపు నాలుగు రెట్లు అధికం కావడం విశేషం. దఖ్లియా గవర్నరేట్లో అత్యధికంగా 4,008 దరఖాస్తులు రాగా, ముసందమ్ గవర్నరేట్లో అత్యల్పంగా 191 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుదారులలో 14,037 మంది పురుషులు, 9,437 మంది మహిళలు ఉన్నారు. ఈ-రిజిస్ట్రేషన్ మే 9న ప్రారంభమై మే 14న ముగిసింది. కొనసాగుతున్న COVID-19 మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం హజ్ కోసం సుల్తానేట్ కోటాను 45 శాతం తగ్గించినట్లు అవ్కాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







