మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు జాక్ పాట్.. రెట్టింపు కానున్న వేతనాలు
- May 17, 2022
* మెరిట్ బడ్జెట్ రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటన
* మైక్రోసాఫ్ట్ సేవలకు డిమాండ్ ఉన్నట్టు సత్య నాదెళ్ల వెల్లడి
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలోనే వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. పెద్ద ఎత్తున రాజీనామాల (గ్రేట్ రిజిగ్నేషన్) సంస్కృతికి చెక్ పెట్టడంతోపాటు, నిపుణులైన వారిని కాపాడుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ మెయిల్ చేశారు.
గ్లోబల్ మెరిట్ బడ్జెట్ ను రెట్టింపు చేయనున్నట్లు ఆయన మెయిల్ లో పేర్కొన్నారు. బడ్జెట్ రెట్టింపు చేయడం అంటే ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచుతున్నట్టు తెలుస్తోంది. కెరీర్ మధ్యలో ఉన్న వారికి చెల్లింపుల కోసం మరింత మొత్తాన్ని కేటాయించనున్నట్లు సత్య నాదెళ్ల చెప్పారు. ఉద్యోగుల వేతన చెల్లింపులపై తాము పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయనున్నట్టు సత్య నాదెళ్ల ఉద్యోగులకు పంపిన మెయిల్ లో పేర్కొన్నారు. ‘‘మన నైపుణ్యాలకు ఎంతో డిమాండ్ నెలకొంది. మన భాగస్వాములు, కస్టమర్ల సాధికారతకు మీరు అందిస్తున్న అద్భుతమైన సేవల వల్లే. అందుకు మీకు పెద్ద ధ్యాంక్స్. మీ ప్రతి ఒక్కరిపై మేము దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెడుతున్నాం’’ అని మెయిల్ లో నాదెళ్ల వివరించారు.
కాగా, ఉద్యోగులను కాపాడుకునేందుకు ప్రముఖ కంపెనీలు ఇటీవలి కాలంలో వేతనాలను భారీగా పెంచుతుండడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు.. అమెజాన్ సైతం ఫిబ్రవరిలో భారీ వేతన పెంపులను ప్రకటించింది. బేసిక్ పేను 1,60,000 డాలర్ల నుంచి 3,50,000 డాలర్లు చేసింది.
తాజా వార్తలు
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 90వ సమావేశం ఘన విజయం
- అమెరికా పర్యటనకు కేటీఆర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్
- పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో యూనిలివర్ లో నియామకాల పై బ్రేక్
- అలర్ట్..పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు!
- రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!









