మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు జాక్ పాట్.. రెట్టింపు కానున్న వేతనాలు
- May 17, 2022
* మెరిట్ బడ్జెట్ రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటన
* మైక్రోసాఫ్ట్ సేవలకు డిమాండ్ ఉన్నట్టు సత్య నాదెళ్ల వెల్లడి
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలోనే వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. పెద్ద ఎత్తున రాజీనామాల (గ్రేట్ రిజిగ్నేషన్) సంస్కృతికి చెక్ పెట్టడంతోపాటు, నిపుణులైన వారిని కాపాడుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ మెయిల్ చేశారు.
గ్లోబల్ మెరిట్ బడ్జెట్ ను రెట్టింపు చేయనున్నట్లు ఆయన మెయిల్ లో పేర్కొన్నారు. బడ్జెట్ రెట్టింపు చేయడం అంటే ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచుతున్నట్టు తెలుస్తోంది. కెరీర్ మధ్యలో ఉన్న వారికి చెల్లింపుల కోసం మరింత మొత్తాన్ని కేటాయించనున్నట్లు సత్య నాదెళ్ల చెప్పారు. ఉద్యోగుల వేతన చెల్లింపులపై తాము పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయనున్నట్టు సత్య నాదెళ్ల ఉద్యోగులకు పంపిన మెయిల్ లో పేర్కొన్నారు. ‘‘మన నైపుణ్యాలకు ఎంతో డిమాండ్ నెలకొంది. మన భాగస్వాములు, కస్టమర్ల సాధికారతకు మీరు అందిస్తున్న అద్భుతమైన సేవల వల్లే. అందుకు మీకు పెద్ద ధ్యాంక్స్. మీ ప్రతి ఒక్కరిపై మేము దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెడుతున్నాం’’ అని మెయిల్ లో నాదెళ్ల వివరించారు.
కాగా, ఉద్యోగులను కాపాడుకునేందుకు ప్రముఖ కంపెనీలు ఇటీవలి కాలంలో వేతనాలను భారీగా పెంచుతుండడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు.. అమెజాన్ సైతం ఫిబ్రవరిలో భారీ వేతన పెంపులను ప్రకటించింది. బేసిక్ పేను 1,60,000 డాలర్ల నుంచి 3,50,000 డాలర్లు చేసింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







