బర్త్డే స్పెషల్: యంగ్ టైగర్ ఇకపై పాన్ ఇండియా స్టార్
- May 20, 2022
చిన్న వయసులోనే హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. నూనూగు మీసాల వయసులోనే స్టార్ హోదా దక్కించుకుని, యంగ్ జనరేషన్కి స్పూర్తిగా నిలిచాడు. అందుకే అభిమానులు ఆయన్ని ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకుంటుంటారు
నిజానికి హీరోగా నిలదొక్కుకోవడానికి యంగ్ టైగర్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అసలు హీరోగా పనికొస్తాడా.? అనే అవమానాలు సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది కెరీర్ తొలినాళ్లలో యంగ్ టైగర్. అన్నింటినీ ఎదుర్కొని నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని మూడో జనరేషన్ హీరోగా పునికి పుచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్.
ఎన్టీయార్ కెరీర్ని టర్న్ చేసిన సినిమా ‘సింహాద్రి’ అని చెప్పుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే 22 కోట్లు కొల్లగొట్టి, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. 9 కోట్ల బడ్జెట్తో ఎలాంటి అంచనాలు లేకుండా రూపొందిన ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడు యంగ్ టైగర్ ఎన్టీయార్.
ఆ తర్వాత మళ్లీ కొన్ని ఫెయిల్యూర్స్ చవి చూసినప్పటికీ హీరోగా తన స్టార్ ఇమేజ్కి ఎలాంటి డ్యామేజ్ రాకుండా చూసుకోవడంలో ఎన్టీయార్ సక్సెస్ అయ్యాడు. లేటెస్టుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా హోదా దక్కించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్.
ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాల నుంచి డిఫరెంట్ లుక్స్లో ఫస్ట్ లుక్ పోస్టర్లు వదిలారు మేకర్లు. ఎన్టీయార్ ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీయార్. ఇలాంటి సక్సెస్ఫుల్ బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ, మనం కూడా ఎన్టీయార్కి బర్త్డే విషెస్ చెప్పేద్దామా. హ్యాపీ బర్త్డే టు యు ఎన్టీయార్.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







