2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’
- May 21, 2022దుబాయ్: డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలను ట్రాక్ చేయడానికి దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. ఇది మెటావర్స్ లో అవకాశాలను మెరుగుపరచనుంది. 2030 నాటికి దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు మెటావర్స్ రంగం నుంచి వచ్చే సహకారాన్ని 4 బిలియన్ డాలర్లకు పెంచడం, దుబాయ్ జీడీపీలో దాని వాటాను 1 శాతానికి పెంచడం ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే రెసిడెంట్ సర్జన్ల పనితీరును 230 శాతం మెరుగుపరచడం, ఇంజనీర్ల ఉత్పాదకతను 30 శాతం పెంచడంతోపాటు 42,000 ఉద్యోగాలను వర్చువల్గా మార్చడంలో సహాయపడే మెటావర్స్ టెక్నాలజీలను అమలు చేయడం వంటి కార్యక్రమాలను ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..