కువైట్ విమానాశ్రయంలో సాధారణ స్థితికి చేరుకున్న విమానాల రాకపోకలు
- May 24, 2022
కువైట్: దుమ్ము తుఫాను కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు గంటల పాటు నిలిచిపోయిన విమానాల రాకపోకలు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:50 గంటలకు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. ఈ సమయంలో విమానాశ్రయానికి వచ్చే, బయలుదేరే విమానాలు రీషెడ్యూల్ చేయబడ్డాయని DGCA ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ అఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇమాద్ అల్-జులువి పేర్కొన్నారు. దుమ్ము తుఫానుతో దేశంలోని వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీని కారణంగా కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత 500 మీటర్ల కంటే తక్కువకు చేరింది. దానితో పాటు గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో కూడిన చురుకైన గాలులు వీచాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







