మక్కాలో హైదరాబాద్ వాసి మృతి..
- May 24, 2022
జెడ్డా: సౌదీ అరేబియా లోని మక్కాలో విషాద ఘటన చోటు చేసుకుంది.హైదరాబాద్ కు చెందిన ఎన్నారై ప్రమాదవశాత్తు ఓ భవనం మీది నుంచి పడి మృతి చెందాడు.ఈ ఘటన ఆదివారం (మే 22న) జరిగింది.మృతుడిని మొహిద్దీన్ అజీజ్ గా గుర్తించారు.అతని స్వస్థలం హైదరాబాద్ లోని యాకుత్ పురా.గత పదేళ్ల నుంచి సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు.జెడ్డాలోని అజిజియా ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నట్లు అతని బంధువులు తెలిపారు.
మక్కాలో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు.ఎప్పటిలాగే ఆదివారం కూడా డ్యూటీకి వెళ్లిన అజీజ్ పనిచేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడు.ఇక ఈ ఘటనపై భారత కాన్సులేట్, లోకల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని స్థానికంగా ఖననం చేయనున్నట్లు అజీజ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









