మక్కాలో హైదరాబాద్ వాసి మృతి..

- May 24, 2022 , by Maagulf
మక్కాలో హైదరాబాద్ వాసి మృతి..

 

జెడ్డా: సౌదీ అరేబియా లోని మక్కాలో విషాద ఘటన చోటు చేసుకుంది.హైదరాబాద్ కు చెందిన ఎన్నారై ప్రమాదవశాత్తు ఓ భవనం మీది నుంచి పడి మృతి చెందాడు.ఈ ఘటన ఆదివారం (మే 22న) జరిగింది.మృతుడిని మొహిద్దీన్ అజీజ్ గా గుర్తించారు.అతని స్వస్థలం హైదరాబాద్ లోని యాకుత్ పురా.గత పదేళ్ల నుంచి సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు.జెడ్డాలోని అజిజియా ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నట్లు అతని బంధువులు తెలిపారు. 

మక్కాలో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు.ఎప్పటిలాగే ఆదివారం కూడా డ్యూటీకి వెళ్లిన అజీజ్ పనిచేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడు.ఇక ఈ ఘటనపై భారత కాన్సులేట్, లోకల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని స్థానికంగా ఖననం చేయనున్నట్లు అజీజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com