బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం వేళ కార్మికులు పని చేయకూడదు

- May 25, 2022 , by Maagulf
బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం వేళ కార్మికులు పని చేయకూడదు


కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మేన్ పవర్, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నెంబర్ 535/2015ను జూన్ నుంచి అమలు చేయనుంది. ఈ నిర్ణయం ద్వారా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పని చేయకూడదు. ఎండ ప్రభావం నేరుగా కార్మికుల మీద వుండకూడదన్నది ఈ నిర్ణయం తాలూకు ఉద్దేశ్యం. ఆయా పని ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఒక్కో కార్మికుడికి 100 నుంచి 200 కువైటీ దినార్ల చొప్పున యజమానులకు జరీమానా విధిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com