కంపెనీల కోసం మొబైల్ వీసా స్క్రీనింగ్ క్లినిక్ ప్రారంభం

- May 25, 2022 , by Maagulf
కంపెనీల కోసం మొబైల్ వీసా స్క్రీనింగ్ క్లినిక్ ప్రారంభం

యూఏఈ: అబుదాబీలో కొత్తగా కంపెనీల కోసం మొబైల్ వీసా స్క్రీనింగ్ క్లినిక్ ప్రారంభమైంది. అబుదాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) వెల్లడించిన వివరాల ప్రకారం, కార్పొరేషన్లకు వీసా స్క్రీనింగ్ సేవల యాక్సెస్‌ని మెరుగు పర్చేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కొత్త క్లినిక్ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. సెహా అంబులేటరీ హెల్త్ కేర్ సర్వీసెస్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ ఒమర్ అబ్దుల్ రెహమ్మాన్ అల్ హషామి మాట్లాడుతూ, ఈ క్లినిక్ ప్రారంభించడం ఆనందంగా వుందని చెప్పారు. ప్రస్తుతం 12 డిసీజ్ ప్రివెన్షన్ సెంటర్స్ అందుబాటులో వున్నట్లు చెప్పారు. పెద్ద కంపెనీలు ఈ మొబైల్ స్క్రీనింగ్ క్లినిక్‌ల ద్వారా లబ్ది పొందుతాయని చెప్పారు. వారాంతాల్లో రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సేవలు అందించేందుకు సిద్ధంగా వున్నట్లు చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com