సౌక్ అల్ మనామాలో గైడెడ్ టూర్లను ప్రారంభించిన బహ్రెయిన్ టూరిజం
- May 25, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ, సౌక్ అల్ మనామాలో గైడెడ్ టూర్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి గురించి పర్యాటకులు ఈ గైడెడ్ టూర్ల ద్వారా సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ టూర్లు ప్రత్యేకమైన అనుభూతిని పర్యాటకులకు అందిస్తాయి. ఏళ్ళ తరబడి మల్టీ కల్చరల్ కమ్యూనిటీస్ ఇక్కడ వర్ధిల్లుతున్న తీరుని పర్యాటకులు సవివరంగా తెలుసుకోవచ్చు. బాబ్ అల్ బహ్రెయిన్ ప్రాంతం నుంచి లైసెన్సు పొందిన గైడ్లు టూరిస్టులకు అందుబాటులో వుంటారు. మే 26 నుంచి శని మరియు బుధవారాల్లో ప్రత్యేకంగా ఈ టూర్లు వుంటాయి. పుడ్ డైవర్సిటీ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. అథారిటీ వెబ్సైట్ ద్వారా టూర్లను బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







